అసంతృప్తులకు కాంగ్రెస్ బుజ్జగింపులు.. కీలక పదవులిస్తామని హామీ!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 04:06:31  IST  )

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ తరుఫున అనేక మంది నేతలు టికెట్​ కోసం పోటీ పడ్డారు.

అసంతృప్తులకు కాంగ్రెస్ బుజ్జగింపులు.. కీలక పదవులిస్తామని హామీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ తరుఫున అనేక మంది నేతలు టికెట్​ కోసం పోటీ పడ్డారు. చివరికి నవీన్​యాదవ్‌కే టికెట్ దక్కింది. దీంతో కొందరు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కష్ట కాలంలో పార్టీని నమ్ముకొని ఉంటే అధిష్టానం తనను పక్కన పెట్టిందని మాజీ ఎంపీ అంజన్ కుమార్​యాదవ్​మీడియా ముఖంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్​వెళ్లి బుజ్జగించారు. రాబోయే రోజుల్లో పార్టీ, పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చినట్టు తెలిసింది. సీఎన్​రెడ్డి సైతం అలగడంతో మంత్రులు పొన్నం, వివేక్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌లు​మాట్లాడి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని హామీనిచ్చారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్​సైతం టికెట్ రేసులో ఉండి చివరికి తాను పోటీలో లేనని ప్రకటించారు. టికెట్​ఎవరికి ఇచ్చినా విజయం కోసం పని చేస్తానని ప్రకటించారు. నవీన్‌యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా బొంతు రామ్మోహన్ బీజేపీ నుంచి టికెట్​ ఆశిస్తున్నట్లు ఇటీవల మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఆ పుకార్లను ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు.

READ MORE ......

మరోసారి రచ్చకెక్కిన మంత్రుల విభేదాలు.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Next Story